డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ కావాలని.. మాజీ మంత్రి నల్లపరెడ్డి.

Sakshitha news

డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ కావాలని.. మాజీ మంత్రి నల్లపరెడ్డి.

మాజీ ముఖ్యమంత్రి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు.డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ కావాలని.. కారకుడైన విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని.నిరుద్యోగ భృతి 3000 వెంటనే ఇవ్వాలని.నియోజకవర్గ స్థాయిలో పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మరియు ర్యాలీ విజయవంతంగా నిర్వహించాలనే నేపథ్యంలో.మాజీ మంత్రి , వైసీపీ రాష్ట్ర పి ఎ సి సభ్యులు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వారి నివాసంలో విద్యార్థి – యువజన నాయకులతో కలిపి నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో.ఐదు మండలాలకు సంబంధించి రిలే నిరాహార దీక్షలుకోవూరు టౌన్ లో.06-08-2026 – కోవూరు టౌన్ – రూరల్ 07-08-2026 – బుచ్చి టౌన్ – రూరల్ 08-08-2026 – విడవలూరు 09-౦8-2026 – కొడవలూరు మరియు10-08-2026 ఇందుకూరుపేట మండలం నందు ర్యాలీ జరుగును కావున నియోజకవర్గస్థాయిలో విద్యార్థి మరియు యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలన్నిటిని విజయవంతం చేయవలసిందిగా సమావేశంలో కోరడం జరిగింది.

Scroll to Top