SAKSHITHA NEWS

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 5.4.2023

మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి సూచనల మేరకు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో భారత మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 116వ జయంతిని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు.

మైలురాయి సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన జాతికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS