SAKSHITHA NEWS

మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ లో జరిగిన మాజీ సర్పంచ్ ఎస్వీ కృష్ణారెడ్డి 55వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులార్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్, బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, శంకర్ నాయక్, నిజాంపేట్ కో ఆప్షన్ సభ్యులు సలీం, సీనియర్ నాయకులు పెద్ద మల్లారెడ్డి, పోలీస్ గోవింద్ రెడ్డి, ఆకుల యాదయ్య, శంభీపూర్ రాము, ఎస్. రాజు, విష్ణు, సాయి ముదిరాజ్, ప్రజాప్రతినిధులు, తెరాస కుటుంబ సభ్యులు, ఎస్వీ కృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS