ఓటు హక్కు పరిరక్షణలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలి”…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గండిమైసమ్మ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే KP. వివేకానంద ఆధ్వర్యంలో దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటరు వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, అర్హులైన వారి పేర్లు ఓటరు జాబితాలో కొనసాగేందుకు కృషి చేయాలని సూచించారు. బూత్ స్థాయిలో అధికారులు, బీఎల్ఓలతో సమన్వయం కొనసాగిస్తూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ప్రజలను ప్రత్యక్షంగా కలిసి అవసరమైన సమాచారం అందించడం, ఓటర్లకు అవగాహన కల్పించడం, అవసరమైన పత్రాల విషయంలో సహాయం చేయడం వంటి అంశాల్లో కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
