SAKSHITHA NEWS

ఎల్లలు దాటిన ఆభిమానం.

కేసిఆర్ అమలు చేస్తున్న పథకాలు చెప్తే సంతొషం వ్యక్తం చేసిన ఇక్కడి వాళ్ళు..

★ జమ్ము కాశ్మీర్ లో BRS (TRS) ఫ్లెక్సీ తో #MDR యువసేన.

కాశ్మీర్ లో బిఆర్ఎస్ ఫ్లెక్సీ ప్రదర్శన.

BRS (టి.ఆర్.ఎస్) అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిసారించడంతో టి.అర్.ఎస్ కాస్త బిఆర్ఎస్ గా మారింది. దీంతో దేశం నలుమూలలనుండి అభిమానులంతా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు.

అందులో భాగంగా పటాన్చెరు కు చెందిన రాష్ట్ర నాయకులు దేవేందర్ రాజు #MDR యువసేన సభ్యులు ప్రీత్విరాజ్ అధ్వర్యంలో కాశ్మీర్ లోని దేశంలోని చివరి గ్రామమైన తాంగ్ లోని భారతదేశం మరియు పాకిస్తాన్ బార్డర్ లో BRS పార్టీ ఫ్లెక్సీని ప్రదర్శించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన BRS పార్టీ హాయంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ఇప్పుడు బి.ఆర్.ఎస్ పార్టీ ద్వారా దేశం అభివృద్ది చెందుతుందని ఈ సందర్బంగా ఆకాంక్షించారు.


SAKSHITHA NEWS