SAKSHITHA NEWS

గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించుకోవడానికి పల్లెల్లో, పట్టణాల్లో వైకుంఠధామాల ఏర్పాటు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గంగారం సమీపంలో వైకుంఠధామం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.

▪️ 1 కోటి 10 లక్షల నిధులతో సౌకర్యవంతంగా వైకుంఠధామాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

▪️ మరణించిన తర్వాత గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు జరగాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలలో మరియు పల్లెల్లో ఎలాంటి విభేదాలు లేకుండా అంతిమ సంస్కారాలు నిర్వహించుకోవడానికి వైకుంఠధామాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS