SAKSHITHA NEWS

సూరారం వాసుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం కాలనీ 60 గజాలకు చెందిన 500 మంది ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇండ్ల పట్టాలు లేదా పొజిషన్ సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, సుభాష్ నగర్ డివిజన్ పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS