SAKSHITHA NEWS

ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి-డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ

హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించబడిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆత్మగౌరవ సదస్సులో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేకుండా వారి జీవితాలను నిర్వీర్యం చేస్తుందని అన్నారు.

ఉద్యమకారులందరినీ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి గుర్తింపు కార్డులు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వారికి బస్సు పాసు రైలు పాసు సౌకర్యం, పెన్షన్ సదుపాయం, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులను వారికి కల్పించి సామాజిక గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు ఉద్యమకారులు సామాజికవేత్తలు సామాన్య ప్రజలు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS