SAKSHITHA NEWS

4వ వార్డు లబ్ధి దారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డుకు చెందిన నలుగురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని స్థానిక కౌన్సిలర్ తుడుం గణేష్ తెలిపారు. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి మేడ్చల్ మండలంలోని లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ తుడుం గణేష్ మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డుకు చెందిన నలుగురు లబ్ధిదారులు బండమీది అనసూయ, తాళ్ల కృష్ణవేణి వేముల పద్మ, దగ్గు సబిత లకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందజేయడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, మేడ్చల్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, కౌన్సిలర్ ఉమా నాగరాజు, కోఆప్షన్ సభ్యులు అలీ, నవీన్ రెడ్డి, నాయకుు సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS