పేద విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు పంపిణీ.

Spread the love

జగ్గయ్యపేట పట్టణం స్వగృహంలో బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వవిప్,శాసనసభ్యులు సామినేని ఉదయభాను జన్మదినం సందర్భంగా సామినేని విమలభాను ఫౌండేషన్ ఆధ్వర్యంలో 500 మంది పేద విద్యార్థులకు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ,ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను వారి సతీమణి విమలభాను ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి సామినేని విమలభాను , వారి తనయులు నియోజకవర్గ యువనాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ బాబు ,కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తాతినేని పద్మ విద్యార్థులకు బస్సు పాసులు అందివ్వడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలను చదివించుకునే తల్లిదండ్రులకు ఆర్థిక భారం పడవద్దని ఉద్దేశంతో జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి బస్ ప్రయాణం చేస్తూ స్కూల్స్ కు వెళ్ళే పేద విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు అందివ్వడం జరిగిందని అన్నారు.అలానే స్థానిక బాలికల పాఠశాల నందు చదువుకునే విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అందివ్వడం జరిగింది అని తెలిపారు.

Related Posts

You cannot copy content of this page