ప్రజా సమస్యలపై డిప్యూటీ మేయర్ పాదయాత్ర….
సాక్షిత: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ సాయి నగర్ లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ & సీనియర్ నాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్ , స్థానిక కాలనీ వాసులతో కలిసి పర్యటించారు. స్థానిక సమస్యలపై పాదయాత్ర చేసి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ, ఓపెన్ నాలా పనులను, అలాగే దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలని చేయాలనీ డిప్యూటీ మేయర్ అధికారులను ఆదేశించారు. వారు మాట్లాడుతూ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు ఏఈ ప్రవీణ్, నాయకులు సంభాశివా రెడ్డి, జలగం చంద్రయ్య,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై డిప్యూటీ మేయర్ పాదయాత్ర….
Related Posts
వివాదానికి కారణం కార్యకర్తల అత్యుత్సాహమే: తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
SAKSHITHA NEWS వివాదానికి కారణం కార్యకర్తల అత్యుత్సాహమే: తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు ఇరువురు నేతలతో మాట్లాడినట్లు మహేశ్ కుమార్ గౌడ్…
కొడుకు.. కోడలు.. చూడడం లేదు నాకు రక్షణ కల్పించండి సారూ…
SAKSHITHA NEWS కొడుకు.. కోడలు.. చూడడం లేదు నాకు రక్షణ కల్పించండి సారూ….ఆర్డిఓ కార్యాలయం ముందు బోరునా విలపించిన వృద్దురాలు* సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : కోదాడ పట్టణంలో గాంధీనగర్ కు చెందిన సోమపంగు వెంకమ్మ, కోదాడ మున్సిపాలిటీలో కామాటిగా…