SAKSHITHA NEWS

ఎమ్మెల్యే చిరుమర్తిపై అసత్య ఆరోపణలను ఖండించిన ధలితబందు లబ్ధిదారులు

చిట్యాల సాక్షిత ప్రతినిధి

దళితబందు పతకంపై ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పై చేస్తున్న అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాము దళిత బంధు లబ్ధిదారులు నాయకులు తెలిపారు. చిట్యాల మండలం వేంబావి గ్రామంలో దళిత బంధు లబ్ధిదారులమందరం ఏ ఒక్కరికి కూడా లంచం ఇవ్వలేదని నిష్పక్షపాతంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. ధలితబందు పథకంతో మా జీవితాల్లో వెలుగు నింపిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పై ఎలక్ట్రానిక్ మీడియాలో చేసిన ఆరోపణలని ఖండిస్తున్నామని సదరు చానెల్ మరియు ప్రతినిధి పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని దళిత బంధు లబ్ధిదారులు ఎస్సై ధర్మ కి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బోగరి నర్సింహ, ప్రసాద్, మహేష్ యాదయ్య, స్వామి, రవి, సతీష్, ముత్తయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS