హోటల్ యజమానుల కు కౌన్సిలింగ్

Spread the love

హోటల్స్ పై ప్రత్యేక నిఘా పటమట సీఐ.మోహన్ రెడ్డి

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటమట పోలీస్ స్టేషన్ సీఐ మోహన్ రెడ్డి, స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని హోటల్స్,లాడ్జి ల యజమానులను పిలిపించి వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఈనెల 27వ తేదీన తలపెట్టిన ఎన్జీవోస్ మీటింగ్ కి ఎలాంటి అనుమతులు లేవని హోటల్స్ లాడ్జి లో బస చేసే వాళ్లు ఎవరైనా వస్తే, వచ్చిన వారి సమాచారం పోలీసు ల కు తెలియజేయాలని.హోటల్స్ రూమ్ లు ఎవరికైనా ఇచ్చేముందు వారి ఆధార్ కార్డును పూర్తిస్థాయిలో పరిశీలించి వారి బయోడేటా పూర్తిగా తీసుకోవాలని,మైనర్లకు రూములు అద్దెకి ఇవ్వకూడదని, రానున్న ఎలక్షన్ల ను దృష్టిలో పెట్టుకుని ఏటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, పటమట సీఐ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా హోటల్స్ యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశారు.

Related Posts

You cannot copy content of this page