SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు మంత్రి భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు..శేరిలింగంపల్లి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపుమేరకు 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్ కాలనీ డివిజన్ సమస్యలపై చేస్తున్న పాదయాత్రలో భాగంగా డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, చాలిస్ మకాన్, గాంధీ నగర్, గురుగోవింద్ సింగ్ నగర్, కేటీఆర్ కాలనీ, జయశంకర్ కాలనీలలో జిఎచ్ఎంసి అధికారులు మరియు స్థానిక ప్రజలతో కలిసి పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ డివిజన్ లో అభివృద్ధి పనులన్నీ దాదాపు తొంభై శాతం పూర్తైయ్యాయని అన్నారు. కాలనీలలో కొంతమేర పెండింగులో ఉన్న డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల పనులను తొందరలో పూర్తిచేస్తామని అన్నారు. పాదయాత్ర చేస్తూ ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు వంటి ఎటువంటి సమస్యలు ఉన్నా పాదయాత్రలో భాగంగా నోట్ చేసుకుని త్వరలో పూర్తిచేస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈరోజు పాదయాత్ర చేసిన కాలనీలలో పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందని, పారిశుధ్య సిబ్బంది వెంటనే కాలనీలలో ఉన్న చెత్తను శుభ్రం చేయాలని ఆదేశించారు.

అలాగే ప్రజలు కూడా బాధ్యతగా ఉండి చెత్తను రోడ్లమీద వేయకుండా చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు మరియు అందించిన సంక్షేమ పథకాలను ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి అందించడం జరిగింది. కార్యక్రమంలో జిఎచ్ఎంసి అధికారులు సి.ఓ ముస్తఫా, వాటర్ వక్స్ రవీందర్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎంటమాలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, స్ట్రీట్ లైట్స్ సూపర్వైజర్ నరేష్, ఎస్.ఎఫ్.ఏ వెంకటరెడ్డి, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, అధ్యక్షులు అనిల్ రెడ్డి, గుడ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, మల్లేష్, ఖాజా, ఫారూఖ్, షాహిద్ అలీ, నాగరాజు, ఖలీమ్, సాయి, అంజాద్, ఫజల్, సదానందగౌడ్, అంజలయ్య, లక్కన్ సింగ్, కరుణాకర్, CH భాస్కర్, ఇంతియాజ్, రాములుగౌడ్, వాలి నాగేశ్వరరావు, మహేష్, సతీష్, భిక్షపతి, సాయిగౌడ్, సంతోష్ బిరాదర్, కూర్మయ్య, బాలరాజు, ప్రకాష్, ఉమేష్, జనయ్య, అజ్జస్, రాజ్యలక్ష్మి, మధులత, షేక్ బీబీ, స్వరూపా, పుట్టం దేవి, రేణుక, సురేఖ, నస్రీన్, నిర్మల, ప్రీతి, లావణ్య, వనజ, శోభారాణి, పర్వీన్, బి.లక్ష్మీ, దేవి, కృష్ణవేణి, నాగలక్ష్మి, జిఎచ్ఎంసి అధికారులు, ఆర్.పిలు, సమాఖ్య లీడర్లు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS