వరంగల్ తూర్పు లో కాంగ్రెస్ ఖాళీ

Spread the love

వరంగల్ తూర్పు లో కాంగ్రెస్ ఖాళీ…

ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 41 వ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ మైనారిటీ నాయకుడు నసీర్ బిఆర్ఎస్ లో చేరిక.
-కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నరేందర్.

కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే నరేందర్ గారు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షతులై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నసీర్ మరియు వారి మిత్ర బృందం పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ లో చేరారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి మార్గ నిర్దేశనంలో తూర్పు నియోజకవర్గాన్నీ 3800 కోట్లతో అభివృద్ధి చేసుకుంటున్నామని వాడ వాడన సీసీ రోడ్లు,1100 కోట్లతో మల్టీ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్,75 కోట్లతో బస్ స్టేషన్, కలెక్టరేట్ తో పాటు మరెన్నో అభివృద్ధి పనులతో నియోజకవర్గాన్ని ముందుంచామన్నారు.
గతంలో ఉన్న నాయకులు పోలీస్ స్టేషన్ పంచాయతీలు తప్ప నియోజకవర్గానికి ఓరగబెట్టింది ఎం లేదని ఎమ్మెల్యే అన్నారు

కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ కుటుంబంలో చేరిన నసీర్ మరియు వారి బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నసీర్ ను వారి బృందానికి  ఎల్లవేళలా తోడుగా ఉంటానని ఎమ్మెల్యే అన్నారు

ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page