క్రైస్తవుల పై ఆదిలాబాద్ ఎంపి సోయం బాబూరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ

క్రైస్తవుల పై ఆదిలాబాద్ ఎంపి సోయం బాబూరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ

SAKSHITHA NEWS

క్రైస్తవుల పై ఆదిలాబాద్ ఎంపి సోయం బాబూరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ. జమ్మికుంట న్యూ విజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఫాస్టర్స్ మాట్లాడుతూ ఆదిలాబాద్ ఎంపి సొయం బాబూరావు క్రైస్తవుల పై వ్యతిరేకంగా మాట్లాడుతు ఆ ప్రాంత క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని మీ గుండెల్లో బుల్లెట్లు దింపుతానని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. క్రైస్తవుల పై చేసిన వ్యాఖ్యలను ఎంపి సోయo బాపురావు వెనక్కి తీసుకుని క్రైస్తవ సోదరులకు మీడియా ముందు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ విజన్ పాష్టర్స్ ఫెలోషిప్ జమ్మికుంట అద్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి జయ రాజు,కోశాధికారి ప్రసాద్ ఫాష్టర్స్, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS