SAKSHITHA NEWS

Complete pending works of solar plant : Commissioner Aditi Singh IAS

తిరుపతి నగరం:
పెండింగులో వున్న సోలార్ ప్లాంట్ పనులపై అలసత్వం వద్దని, పనుల పూర్తికి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ తెలిపారు. తూకివాకం వద్ద నున్న 6 మెగా వాట్స్ గ్రౌండ్ మౌంట్ సోలార్ ప్రాజెక్ట్ పనులను, అదేవిధంగా వినాయకసాగర్ వద్ద గల 5 ఎం.ఎల్.డి మురుగునీటి శుద్ది కేంద్రాన్ని కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సోలార్ ప్రాజెక్ట్ పనులపై అలసత్వం వలన చాలా ప్రాజెక్ట్ చాలా ఆలస్యం అయిన విషయాన్ని పరిశీలించి కాంట్రాక్టర్ పై అసహనం వ్యక్తం చేస్తూ, మరో నెలలోపు ప్రాజెక్ట్ పూర్తికాకపోతే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా వినాయకసాగర్ వద్దనున్న మురుగునీటి శుద్ది కేంద్రాన్ని పరిశీలించి, మరికొన్ని పనులు పెండింగులో వున్న విషయాన్ని ప్రస్థావిస్తూ పూర్తిస్థాయిలో కేంద్రాన్ని ప్రయోజనంలోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమాల్లో కమిషనర్ వెంట మునిసిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఏయికామ్ సంస్థ ప్రతినిధి భాలాజీ, డిఈ విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు.


SAKSHITHA NEWS