SAKSHITHA NEWS

బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు.

మధ్యాహ్నం 2:40 గంటలకు తాడేపల్లి లోని ఆయన నివాసంలో బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు.

అక్కడ జరిగే సిద్ధం సభలో పాల్గొని ప్రసగించనున్నారు.

మరోవైపు ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరుకానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

వైఎస్సార్సీపీ పార్టీ మేనిఫెస్టో కూడా విడుదల చేస్తారు అని సమాచారం.


SAKSHITHA NEWS