SAKSHITHA NEWS

CM అమరావతి:
రాజకీయ నాయకుల కాళ్ల కు దండం పెట్టే సంస్కృతి పోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరికి వారు తక్కువ చేసుకోవద్దు. తల్లిదండ్రుల కు,భగవంతుడికి మాత్రమే కాళ్లకు దండం పెట్టండి అంటూ చంద్రబాబు సూచించారు.

అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు చిట్ చాట్ మాట్లాడారు. ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే వారి కాళ్లకు నేను దండం పెడతాను అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యా నించారు.

నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొ ద్దనే సంస్కృతి నా నుంచే ప్రారంభిస్తున్నా. కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని చంద్రబాబు సూచించారు.

అనంతరం పార్టీ కార్యాల యంలో కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులను చంద్ర బాబు స్వీకరించారు. అంత కుముందు సీఎం చంద్రబా బు నాయుడు గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో పూజలు నిర్వహించారు.

వెంకటేశ్వర ఆలయ నిర్మా ణంలో భాగంగా అనంతశేష స్థాపన, గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు…

CM

SAKSHITHA NEWS