SAKSHITHA NEWS

గుంటూరులో కలరా కలకలం రేపుతోంది. పట్టణంలో మూడు కలరా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 10-24 తేదీల మధ్య ప్రభుత్వాస్పత్రిలో 345 మల నమూనాలు పరీక్షిస్తే 3 విబ్రియో కలరా కేసులు, 20 ఈ-కోలీ కేసులు, ఒక షగెలా కేసు బయటపడ్డాయి. కలరా సోకిన ముగ్గురికీ గంజి నీళ్లలా విరేచనాలు అవుతుండటంతో కల్చర్ టెస్ట్ చేయించారు. ఈ పరీక్షలో వారికి కలరా ఉన్నట్లు తేలింది. కలుషిత నీటి వల్లే ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు తెలిపారు.


SAKSHITHA NEWS