దాత్రి గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రం మరియు మజ్జిగ కేంద్రం

Spread the love

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని మంజీర రోడ్డు లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాత్రి గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రం మరియు మజ్జిగ కేంద్రం ను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ . అనంతరం చల్లని మజ్జిగను కాలనీ వాసులకు అందచేశారు..

ఈ   సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నగరంలో రోజు రోజుకూ ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయని  ప్రజలు ఎండలకు నీళ్లకు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఈ చలివేంద్రం దాహార్తిని తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, చలివేంద్రాలు ప్రజల దాహాన్ని తీర్చడానికి ఎంతో దోహద పడుతాయని మరియు బాటసారులు ,వాహనదారుల దాహాన్ని తీరుస్తాయి అని,ప్రజలందరూ ఉపయోగించుకోవాలని .చలి వేంద్రాలు ఏర్పాటు చేయడం మంచికార్యక్రమం అని వేసవికాలంలో ప్రజల దాహాన్ని తీర్చడం గొప్ప విషయం అని, అన్ని దానల కన్నా నీటి దానం చాల  గొప్పదని పేర్కొనడం జరిగినది .వేసవి కాలంలో .ప్రజలకు ఉపయోగపడేలా ఇలాంటి చలి వేంద్రలు ఏర్పాటు చేయడం మంచి  కార్యక్రమం అని  ఈసందర్బంగా చలి  వేంద్రం ఏర్పాటు  చేసిన నిర్వాహకులు దాత్రి గౌడ్ ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గాంధీ అభినదించడం జరిగినది .అందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి చలి వేంద్రలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటేష్ యాదవ్ ,శేఖర్ గౌడ్, బాబు మోహన్ మల్లేష్,అర్జున్,శ్రీనివాస్,వెంకట్ రెడ్డి,ఆశీల శివ, శాస్త్రి, కిషోర్ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page