SAKSHITHA NEWS

స్పీడ్ ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సాక్షిత : స్పీడ్ ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష సమావేశం లో మంత్రి జూపల్లి కృష్ణారావుగారు, తెలంగాణ రాష్ట్ర టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయడంతో పాటు ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వీటితోపాటు హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయడం సహా హైదరాబాద్ బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. వనరుల అభివృద్ధికి అవసరమైనచోట పీపీపీ విధానాన్ని అవలంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS