శ్వేతపత్రాల విడుదలకు సిద్ధమైన చంద్రబాబు
ఏడు ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నేడు పోలవరంపై తొలి వైట్ పేపర్ను విడుదల చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోలవరం విధ్వంసంపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
![శ్వేతపత్రాల విడుదలకు సిద్ధమైన చంద్రబాబు 2 శ్వేతపత్రాల విడుదలకు సిద్ధమైన చంద్రబాబు](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-28-at-10.12.41.jpeg)