SAKSHITHA NEWS

ఘనంగా పల్లపు బుద్ధుని జన్మదిన వేడుకలు

చిట్యాల సాక్షిత ప్రతినిధి

భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు జన్మదిన వేడుకలని ఘనంగా నిర్వహించారు. చిట్యాల పట్టణంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయ అర్చకులు పూలదండతో శాలువాతో సన్మానించి కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని దీవించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ పల్లపు బుద్ధుడుని శాలువాతో పూలమాలతో సన్మానించి కేక్ కటింగ్ చేశారు.

చిట్యాల కనకదుర్గ అమ్మవారి గుడి వద్ద బిజెపి చిట్యాల మున్సిపాలిటీ అధ్యక్షులు కూరెళ్ల శ్రీను, ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్ మరియు చిట్యాల మండల రూరల్ అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ గౌడ్ ల ఆధ్వర్యంలో పల్లపు బుద్ధుడు ని శాలువాతో సన్మానించి స్వీట్ తినిపించారు. పుట్టినరోజు సందర్భంగా పల్లపు బుద్ధుడు
చిట్యాల ప్రభుత్వాసుపత్రిలో పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాస శ్రీనివాస్, పీకే వెంకన్న, పాకాల దినేష్ ఇమ్మడి విజయ్, రావుల వెంకన్న, లింగస్వామి, ఆగు సైదులు, నరేష్, సందీప్, ఆరిఫ్, ఎల్లయ్య, రమేష్, నాగరాజు, శివ, నరసింహ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS