SAKSHITHA NEWS

సాయం కోసం ఫోన్ చేయండి.. వీరబాబు సీఐ మోకిలా

సాక్షిత శంకర్ పల్లి :సెప్టెంబర్:ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని మోకిలా సీఐ వీరబాబు ప్రజలకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర సహాయం కోసం డయల్ 100 కు ఫోన్ చేయాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. విద్యుత్ స్తంభాలను ఎవరూ తాకొద్దని కరెంటు విషయంలో జాగ్రత్తలు పాటించాలని రోడ్లపైకి వచ్చిన వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని.. నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు


SAKSHITHA NEWS