నూతనంగా వేసిన బోర్ పాయింట్ ను పరిశీలించిన బుచ్చి చైర్ పర్సన్ సుప్రజ
సాక్షిత : సమస్యలుంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తాం
బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలోని 7వ వార్డు ఖాజానగర్ లో నూతనంగా వేసిన బోర్ పాయింట్ ను పరిశీలించిన బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ.అనంతరం అక్కడ స్థానిక నాయకులతో కలిసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు… త్వరలో నే నూతన డ్రైనేజీ నిర్మాణాలు చేపడతామనిచెప్పారు, స్థానికులు తెలిపిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఇనమల చినబాబు, వైస్ చైర్మన్ ఏరటపల్లి వెంకట శివ కుమార్ రెడ్డి,టౌన్ ఆర్గనైజర్ సెక్రెటరీ సుభాని, బుచ్చిరెడ్డిపాళెం పట్టణ మైనార్టీ అధ్యక్షులు షేక్ సంధాని, బుచ్చిరెడ్డిపాళెం పట్టణ మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్. అక్తర్, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
