SAKSHITHA NEWS

బొంతపల్లి వీరభద్ర స్వామి దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

నూతన గుండం ప్రారంభం
…………………………………….

సాక్షితగుమ్మడిదల , : రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రంగా పేరుందిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం అభివృద్ధికి ప్రభుత్వపరంగా కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

బుధవారం మండల పరిధిలోని బొంతపల్లి లో గల వీరభద్ర స్వామి దేవాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన గుండంను స్థానిక ప్రజాప్రతినిధుతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయంలో వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆలయం అభివృద్ధికి 20 లక్షల రూపాయల సొంత నిధులను అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం, దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు.


SAKSHITHA NEWS