మీ బిడ్డగా భావించండి.. ఆశీర్వదించండి: నర్సరావుపేట ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్

Spread the love

మా ఇద్దరిని గెలిపించండి, జగనన్నను మళ్లీ సీఎం చేయండి: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
ఉంగుటూరులో వైఎస్సార్సీపీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం

తనను మీలో ఒకడిగా భావించి ఆశీర్వదించాలని నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కోరారు. అమరావతి మండలం ఉంగుటూరులో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. జగనన్న ఆశీర్వాదంతో మొదటిసారి పల్నాడు ప్రాంతానికి వచ్చానని… ఇక్కడి ప్రజలు తనను సొంత మనిషిలా భావించి స్వాగతించారన్నారు. గతంలో నెల్లూరు నుంచి వచ్చిన నేదురుమల్లి జనార్ధనరెడ్డి , మేకపాటి రాజమోహన్ రెడ్డి ని ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్నారు.

తనను కూడా సొంతవాడిలా భావించి ఆశీర్వదించాలని కోరారు. ఇక నుంచి పల్నాడు ప్రాంతం తన సొంత ఇల్లులా చూసుకుంటానన్నారు. ఎంపీగా తనను,ఎమ్మెల్యేగా నంబూరు శంకరరావు ని గెలిపిస్తే.. ఇద్దరం కలిసి మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశానన్నారు. 30 ఏళ్లలో చేయని అభివృద్ధిని ఐదేళ్లలో చేశానన్నారు. మరోసారి తనకు అండగా నిలబడాలని కోరారు. పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు తనను, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ని గెలిపిస్తే.. మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.

Related Posts

You cannot copy content of this page