SAKSHITHA NEWS

బాపట్ల లో ఘనంగా మాజీ కౌన్సిలర్, వైఎస్సార్సీపీ నాయకులు చింతా కిషోర్ పుట్టినరోజు వేడుకలు… ముఖ్య అతిథిగా పాల్గొని కిషోర్ చేత కేక్ కట్ చేయించిన వైయస్సార్సీపి బాపట్ల నియోజకవర్గం నాయకులు గాదె మధుసూదన రెడ్డి

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బాపట్ల మాజీ మున్సిపల్ కౌన్సిలర్, వైస్సార్సీపీ నాయకులు చింతా కిషోర్ పుట్టినరోజు వేడుకలు బాపట్ల పట్టణం పటేల్ నగర్ లోని వైస్సార్సీపీ బాపట్ల నియోజకవర్గం నాయకులు గాదె మధుసూదన రెడ్డి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చింతా కిషోర్ చేత కేక్ కట్ చేయించిన గాదె మధుసూదన రెడ్డి, అనంతరం మంచివాడు, సౌమ్యుడు అయిన చింతా కిషోర్ భవిష్యత్తులో మరన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఈ సందర్భంగా గాదె మధుసూదన రెడ్డి ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బాపట్ల నియోజకవర్గం నాయకులు అల్లం గోపికృష్ణ, గోవత్రోటి విజయ్, పాపినేని రాధా, గంపాల వెంకటరెడ్డి, మహిళా నాయకురాలు జీ. గిరిజా రాణి, దోనేపూడి ప్రసన్న కుమార్, ఆవుల సురేష్, లింగిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని చింతా కిషోర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు


SAKSHITHA NEWS