SAKSHITHA NEWS

ఖమ్మం జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ పుట్టినరోజు వేడుకలు..

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

బుధవారం నాడు ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా యువజన అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో స్థానిక జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల లోని మాతా శిశు కేంద్రం వద్ద 300 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడంమైనది. ఈ సందర్భంగా యువజన జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించి ఉన్నతమైన విద్యను అభ్యసించి అంచలంచలుగా ఉన్నతమైన స్థానానికి ఎదిగి, ఎంతోమంది నిరుపేదల విద్యార్థులకు చేయూతనిస్తూ పేదలకు సాయం అందించే తాత మధుసూదన్ అనది కాలంలోనే ఎమ్మెల్సీగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జిల్లా ప్రజలకు ఆత్మీయుడిగా చేరువయ్యారని తెలిపారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు ఘనవిజయం సాధించే విధంగా వారికి భగవంతుడు శక్తి ప్రసాదించాలని ప్రార్థించినట్లు వారు తెలియజేశారు. యువజన అధ్యక్షుడు కృష్ణ చైతన్య వెంట ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు బొమ్మెర రామ్మూర్తి , బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యాల వెంకట అప్పారావు , అశ్విని, లింగాల రవికుమార్, తాతా మధుసూదన్ పిఎ. సుమంత్, సోషల్ మీడియా వారియర్ సద్ధాం షేక్ , అభయం స్వచ్ఛంద సంస్థ మాధవి రెడ్డి శ్రీదేవి , యువజన విజేత, రవి మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS