పేదగుండెల్లో నిలిచిన జగనన్నాకే మన అండ – డిప్యూటీ మేయర్ భూమన అభినయ్

Spread the love

సాక్షిత తిరుపతి : ప్రజా సంక్షేమ పథకాలను అందిస్తూ పేదల గుండెల్లో నిలిచిన జగనన్నకు మనమందరం అండగా నిలవాలని కోరుతూ గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించిన తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ప్రజలను కోరారు. తిరుపతిలోని 3, 21వ డివిజన్లలో ప్రభుత్వ పధకాలు పొందుతున్న లబ్ధిదారులను వారి ఇండ్ల వద్దకే నేరుగా వెల్లి వారితో మమేకమవుతూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ జగన్ మోహన్ రెడ్డికి మనమంతా అండగా వుండాల్సిన అవసరముందని ప్రజలకు భూమన అభినయ్ రెడ్డి కోరారు.

జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో రాష్ట్రమంతా పర్యటిస్తూ ప్రజల కష్టాలను, కన్నీళ్ళను నేరుగా చూస్తూ ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రిగా అయిన వెంటనే ప్రజా పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు అండగా నిలిచిన మన జగనన్నకు రానున్న ఎన్నికల్లో అండగా నిలిచి ప్రజా సంక్షేమ పాలనకు తోడ్పాటును అందివ్వాలన్నారు. తిరుపతి అభివృద్దికి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి నిత్యం పాటుపడుతున్నారని వివరిస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా తామంతా నిత్యం ప్రజలకు అందుబాటులో వుంట్టున్నామని మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటి సభ్యులు తమ్ముడు గణేష్, 21వ డివిజన్ కార్పొరేటర్ ఈశ్వరి ఆధ్వర్యంలో జరగగా కార్పొరేటర్లు ఆరణి సంధ్య, తిరుపతి మునిరామిరెడ్డి, వైసిపి నాయకులు కుమార్, అనీల్, డిష్ చంధ్రా, నాగరాజ్, జీవన్, మబ్బు నాధమునిరెడ్డి, తిమ్మారెడ్డి, నాగరాజ్, మనోహర్ రెడ్డి, రెడ్డిరాణి, వెంకటేశ్వరరావు, మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page