SAKSHITHA NEWS

నీచ రాజకీయాలు మానుకో జివి..

అక్రమ మట్టి తవ్వకాల ఆరోపణలు చేయటం నీ నీచ రాజకీయాలకు నిదర్శనమని వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు అన్నారు..

వినుకొండ లోని వారి డైరీ ఫాం దగ్గర ఏదో మట్టి తవ్వకాలు జరుపుతున్నాయని, ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయాలనుకున్న జివి ఆంజనేయులు కు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు ఘాటుగా స్పందించారు. నా పోలం లో ఎటువంటి మట్టి తోలకాలు జరపటం లేదని స్పష్టం చేశారు. నీకు దమ్ము ఉంటే నా పొలం లో మట్టి తోలకాలను ఆధారాల తో నిరూపించమని సవాలు విసిరారు. నా పొలం లో డైరీ ఫాం నిర్మాణం కొరకు నేలను చదును చేసి, గునాదులు కోసం తీసిన మట్టిని కుప్పగా పోశాము, అలాంటి మట్టి కుప్పలను చూపిస్తూ, అక్రమ మట్టి తవ్వకాల అనటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

మట్టి తోలవలసిన అవసరం నాకేంటి అని ప్రశ్నించారు. నా పై ఇలా అసత్య ఆరోపణలు చేసిన జివి పై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. అలాగే నా అనుమతి లేకుండా నా పొలం లోకి ఎలా వస్తారు అని ప్రశ్నించారు. డైరీ ఫాం నిర్మాణం లో ఉండగా ఇక్కడ అనేక రకమైన, విలువైన పరికరాలు, పనిముట్లు ఉన్నాయి. అవి ఏమైన అపహరణ అయితే పూర్తి భాద్యత జివి ఆంజనేయులే తీసుకోవాలని తెలిపారు. మా సిబ్బంది ని ఎదిరించి, వారిపై దాడి చేసి మరి నా పొలం లోకి వచ్చి, నాపై ఆరోపణలు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మీలాగా మేము చేయటానికి నిమిషం పని, కాని మాకు సభ్యత సంస్కారం అడ్డువస్తున్నాయని తెలిపారు.

SAKSHITHA NEWS