కడప జిల్లాలో… తెలంగాణ పోలీసులపై దాడి.

Spread the love

ఒకరోజు ఆలస్యంగా… వెలుగులోకి వచ్చిన వైనం.

కేసు దర్యాప్తు నిమిత్తం మైదుకూరు మండలం చిన్నయ్యగారి పల్లె గ్రామానికి చేరుకున్న చందంపేట పోలీసులు.

తెలంగాణలో 50 లక్షలు విలువ చేసే గొర్రెలు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన చిన్నయ్యగారి పల్లె గ్రామ వాసులు.

నల్లగొండ జిల్లా చందంపేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు.

దర్యాప్తులో భాగంగా చిన్నయ్యగారి పల్లెకు చేరుకున్న ఎస్సై సతీష్ తో పాటుగా నలుగురి కానిస్టేబుల్ పై విచక్షణ రహితంగా దాడి చేసిన ఓబుగాని శివ, సాంబయ్య మరియు వారి అనుచరులు.

దాడిలో ఎస్సై తలకు తీవ్ర గాయాలు. స్వల్పంగా గాయపడ్డ కానిస్టేబుళ్లు.

చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించిన మైదుకూరు పోలీసులు.

గాయపడ్డ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు… హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మైదుకూరు పోలీసులు.

Related Posts

You cannot copy content of this page