
WEF సదస్సు ద్వారా ప్రపంచ వేదికపై ‘ఏపీ బ్రాండ్’ ఇమేజ్
ప్రభుత్వ పాలసీలు, అవకాశాలు, ఆలోచనలను వివరించి దిగ్గజ సంస్థలకు ఆహ్వానం
ముఖాముఖి భేటీలు, సదస్సులు, చర్చలతో ఎపిని ఆవిష్కరించిన సిఎం చంద్రబాబు
మార్స్క్ నుంచి మైక్రోసాఫ్ట్ ప్రపంచ స్థాయి సంస్థలు, సీఈవోలతో చర్చలు
నెట్వర్క్ విస్తరణ, బ్రాండ్ ప్రమోషన్ లో సక్సెస్….ఆశావాహంగా సిఎం బృందం దావోస్ టూర్
ముగిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పర్యటన…తిరుగు ప్రయాణం
దావోస్, జనవరి 23:- ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ నాలుగు రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈవోలు-అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే… మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్ను, ఎపి బ్రాండ్ ను ముఖ్యమంత్రి ప్రమోట్ చేశారు.
సమావేశాలు సఫలం :
ప్రపంచం దేశాల నుంచి దావోస్కు వచ్చిన పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో చంద్రబాబు సంపూర్ణంగా సఫలమయ్యారు. వివిధ రంగాలకు చెందిన దాదాపు 15 ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. వాణిజ్యాభివృద్ధికి, పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రం కొత్తగా తీసుకువచ్చిన పాలసీలు, స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికలు… పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయసహకారాల గురించి వివరించారు. రాష్ట్రానికి వచ్చి అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించాలని వారిని ఆహ్వానించారు. దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనబరిచాయి. స్వయంగా రాష్ట్రంలో పర్యటించి పెట్టుబడుల అంశాలన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయా సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి.
పర్యటన మొదటి రోజు :
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు తొలిరోజు పర్యటనలో ముందుగా జ్యూరిచ్లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్లోని భారత అంబాసిడర్ మృధుల్ కుమార్తో సమావేశమై రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ఫార్మాస్యుటికల్స్, మెడికల్ డివైజ్లు, టెక్నికల్ టెక్స్టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీ, స్విట్జర్లాండ్ యూనివర్సిటీలు.. ఏపీలో ఏర్పాటు చేస్తున్న స్కిల్లింగ్, ఏఐ యూనివర్సిటీకి కలిసి పనిచేసేలా చూడాలని మృధుల్ కుమార్కు చెప్పారు.
స్విట్జర్లాండ్ కంపెనీల సీఈవోలతో భేటీ :
స్విస్మెన్, ఓర్లికాన్, ఆంగ్స్ట్ ఫిస్టర్, స్విస్ టెక్స్టైల్స్ సీఈవోలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు.
స్విస్మెన్: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, ఇన్నోవేషన్ హబ్లు – ఇంక్యుబేటర్ల ఏర్పాటు, స్విస్ వెట్ తరహాలో రాష్ట్రంలో ప్లంబింగ్ ల్యాబ్ల ఏర్పాటుకు, శిక్షణ కార్యక్రమాలకు ‘స్విస్మెన్’ కంపెనీ ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు.
ఓర్లికాన్: రాష్ట్రంలో అడ్వాన్స్ కోటింగ్ సెంటర్ ఆవశ్యకత ఉందని, అలాగే ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఎనర్జీ, టూలింగ్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయని, పరిశోధన కోసం ఏఎం సెంటర్ నెలకొల్పవచ్చని… వీటిని ‘ఓర్లికాన్’ వినియోగించుకోవచ్చని చంద్రబాబు చెప్పారు.
ఆంగ్స్ట్ ఫిస్టర్: అడ్వాన్డ్స్ సీలింగ్ సొల్యూషన్స్ ప్లాంట్, యాంటీవైబ్రేషన్ సిస్టమ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయమని ‘ఆంగ్స్ట్ ఫిస్టర్’ను కోరారు.
స్విస్ టెక్స్టైల్: ఏపీ టెక్స్టైల్ రంగంలో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కోసం ‘స్విస్ టెక్స్టైల్స్’ ఆహ్వానం పలికారు.
జ్యూరిచ్లో అపూర్వ స్వాగతం :
దావోస్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు ముందుగా జ్యూరిచ్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారుల బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. పెద్దఎత్తున తరలివచ్చిన యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు.
కలుసుకున్న ఇరు రాష్ట్రాల సీఎంలు :
జ్యూరిచ్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రాలకు వస్తున్న పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది.
తెలుగు పారిశ్రామిక వేత్తలతో భేటీ జ్యూరిచ్లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్లో చంద్రబాబు పాల్గొన్నారు. నిత్య స్ఫూర్తి నిచ్చే తెలుగు జాతిలో పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని….మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు బిడ్డగానే పుడతానని అన్నారు. తెలుగువారు ప్రపంచమంతా ఉండాలి… కర్మభూమిని పట్టించుకోవాలి… జన్మభూమికి అవకాశాలు కల్పించాలని జ్యూరిచ్ వేదికగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. యూరప్లోని 12 దేశాల నుంచి ఈ సమావేశానికి తెలుగు ప్రజలు వచ్చారు.
పర్యటన రెండవ రోజు:
పర్యటన రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు.. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ప్రత్యేక సెషన్లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్పై ప్రసంగించారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో విజయం సాధించి… గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్లుగా ఎదిగే సత్తా భారతీయల్లో ఉందన్నారు. మానవ వనరుల లభ్యత ఏపీకి ప్లస్ పాయింట్ అని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నారని, తమ ప్రతిభతో రాణిస్తున్నారని అన్నారు. స్వర్ణాంధ్ర – 2047 విజన్ రోడ్మ్యాప్లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న పది మార్గదర్శక సూత్రాలను ముఖ్యమంత్రి వివరించారు. భవిష్యత్ నాయకులను సిద్ధం చేయడానికి అమరావతిలో ఏర్పాటు చేయబోయే గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ (GLC) ఉపయోగ పడుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్కు గ్లోబల్ హబ్గా మార్చడానికి కృషి చేస్తున్నట్టు తన ప్రసంగంలో చెప్పారు.
ఆసక్తి చూపిన ‘మార్స్క్’: ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలలో ఒకటైన డెన్మార్క్కు చెందిన మార్స్క్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. మార్స్క్ కంపెనీ సీఈవో విన్సెంట్ క్లర్క్తో చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. వెయ్యి కిలోమీటర్ల పైనే తీరప్రాంతం కలిగి వుండటం, విస్తారంగా పోర్టులు ఉండటం… ఆంధ్రప్రదేశ్ బలమని, మానవ వనరులకు లోటు లేదని… విన్సెంట్ క్లర్క్కు తెలిపారు.
సిస్కో : డేటా సెంటర్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో పేరున్న మల్టీ-నేషనల్ టెక్నాలజీ సంస్థ సిస్కో చైర్మన్, సీఈవో చుక్ రాబిన్స్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. విశాఖ లేదా తిరుపతిలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటుతో పాటు, నెట్వర్క్ భాగాల తయారీకి ఆహ్వానించారు.
ఎల్జీ కెమ్ : దక్షిణ కొరియాలో అతిపెద్ద కెమికల్ కంపెనీ అయిన ఎల్జీ కెమ్ లిమిటెడ్ సీఈవో షిన్ హక్ చియోల్తో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి ఎల్జీ కెమ్ అనుబంధ సంస్థ ఎనర్జీని రాష్ట్రంలో నెలకొల్పాల్సిందిగా కోరారు. పెట్రో కెమికల్ రంగంలో యూనిట్లు మూలపేట – విశాఖలోనూ, సెమీకండక్టర్ యూనిట్ తిరుపతిలోనూ నెలకొల్పేందుకు వున్న అవకాశాలను పరిశీలించమని కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్, దక్షిణ కొరియా మధ్య పెట్టుబడుల కోసం ఎల్జీ కెమ్ సీఈవోను అంబాసిడర్గా ఉండాలని అభ్యర్ధించారు.
కార్ల్స్బెర్గ్ గ్రూప్: పళ్ల రసాలు, శీతల పానీయాలు, బీర్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, ఉత్పత్తి చేసే కార్ల్స్ బెర్గ్ గ్రూప్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ఇంటిగ్రేటెడ్ బ్రూవరీ, బాట్లింగ్ యూనిట్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయమని అభ్యర్థించారు. ఇందుకోసం విశాఖపట్నం, కృష్ణపట్నం, శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించమని చెప్పారు. బార్లీ, మొక్కజొన్న, వరి వంటి అధిక నాణ్యమైన ఆహార ఉత్పత్తులను సేకరించేందుకు ఏపీ రైతులతో భాగస్వామి కావాలని కోరారు.
ఆర్సెల్లార్ మిట్టల్ ప్రాజెక్టు: అనకాపల్లిలో రూ. 1.4 లక్షల కోట్ల పెట్టుబడితో 17.8 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్టుపై ఆర్సెలార్ మిట్టల్/నిప్పన్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ ఎన్. మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు.
వెల్స్పన్ వెల్స్పన్ చైర్మన్ బీకే …
