SAKSHITHA NEWS

బాపట్ల జిల్లా

అన్నదాత సుఖీభవ

149వ రోజు అన్న క్యాంటీన్

స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నందు నేడు 149వ రోజు బాపట్ల కి చెందిన దొప్పలపూడి మల్లిఖార్జున రావు జ్ఞాపకార్థం వారి సతీమణి ప్రమీల రాణి , వారి కుటుంబ సభ్యుల సహకారంతో దాదాపు 320 మంది పేదలకు అన్న వితరణ చేయడం జరిగింది. పేదల ఆకలి తీర్చే ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యి తమ సహకారాన్ని అందించిన దాతలకు నరేంద్ర వర్మ ధన్యవాదాలు తెలియజేశారు.


SAKSHITHA NEWS