హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అల్లాపూర్ సొసైటీ కాలని లో పలు సమస్యలు

Spread the love

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అల్లాపూర్ సొసైటీ కాలని లో పలు సమస్యలు మరియు చేపట్ట వలసిన పలు అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సిబ్బంది, జలమండలి అధికారులు మరియు కాలనీ వాసులతో కలసి పాదయాత్ర చేసిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు,

కాలనీ లోని డ్రైనేజ్ సమస్యపై జలమండలి అధికారులతో పరిశీలించామని, త్వరితగతిన పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది, అలానే హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ ప్రశాంతి, సూపర్వైజర్ నరేంద్ర, జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, సంగమేశ్వర రావు, శివ రెడ్డి, రావూరి శ్రీనివాస్, రమేష్, సుబ్బారాయుడు, సత్యనారాయణ, మధు, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page