SAKSHITHA NEWS

అన్ని విధాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా…

-సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల

రాజమహేంద్రవరం రూరల్, సాక్షిత :

రాజానగరం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద రూ.2.25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే గాదరాడ నుండి నందరాడ వరకు సిమెంట్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బలరామ కృష్ణ శంకుస్థాపన చేసారు. అనంతరం శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బాలరాముడు మాట్లాడుతూ తన నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి లో ముందుకు పోవటానికి తనవంతు కృషి చేస్తా అని అన్నారు శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ తో పాటు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

WhatsApp Image 2024 08 19 at 18.15.03

SAKSHITHA NEWS