కార్యకర్తలే పార్టీకి శ్రీరామ రక్ష…

Spread the love

కార్యకర్తలే పార్టీకి శ్రీరామ రక్ష…
విపక్షాల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి…
కొంపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి ఏఎంఆర్ గార్డెన్స్ లో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ అధ్యక్షతన జరిగిన కొంపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి శ్రీరామ రక్ష అని, బీఆర్ఎస్ పార్టీ కష్టపడిన ప్రతీ కార్యకర్తను తప్పక గుర్తిస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. ఎన్నికల వేళ మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టేందుకు విపక్షాలు కూడగట్టుకుని వస్తారని వారికి సరైన బుద్ధి చెప్పేలా కార్యకర్తలు సమాయత్తం కావాలన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకులపై విపక్షాలు చేసే తప్పుడు ఆరోపణలను వెనువెంటనే తిప్పి కొట్టేలా కార్యకర్తలు పని చేయాలన్నారు. మన పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో గులాబీ జెండా మూడవ సారి ఎగిరేలా బీఆర్ఎస్ శ్రేణులు సమిష్టి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ సన్న కవిత శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు బూర్గుబావి హనుమంత రావు, పాక్స్ చైర్మన్ నరేందర్ రాజు, సంపత్ మాధవ రెడ్డి, కస్తూరి బాల్ రాజ్ మరియు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page