కోర్టు వాయిదాలకు గైర్హాజరు…
ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసు నిందితుడు అరెస్ట్….
సాక్షిత పెద్దపల్లి// మంచిర్యాల జిల్లా కోర్టులో కొనసాగుతున్న ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులో నిందితుడైన గోగు బాలకృష్ణ (నివాసం: తంగళ్లపల్లి, కిస్టంపేట) కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.ఈ నేపథ్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు.
అనంతరం, ఆయనను మంచిర్యాల జిల్లా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని లక్షెట్టిపేట్ జైలుకు తరలించినట్లు తాండూరు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలు చట్టాలను గౌరవించి, కోర్టు వాయిదాలకు తప్పకుండా హాజరు కావాలని సూచించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
