SAKSHITHA NEWS

విద్యార్థుల ఆజ్ఞానపు చీకట్లను తొలగించే గురువులకు ఘన సన్మానం..

సాక్షిత : ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ….
ఈ నెల ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ప్రభుత్వ పాఠశాలలో భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ పదానికి పర్యాయ పధంగా నిలిచి, భారత రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు అలంకరించిన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా టీచర్స్ డే ను నిర్వహిస్తామని తెలియజేసారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ధి , యువతను అత్యున్నత శిఖరాలను చేరవేస్తున్న గురువులందరికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో PACS డైరెక్టర్ సత్తిరెడ్డి , సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి , BRS పార్టీ 16వ వార్డ్ కమిటీ అధ్యక్షులు మన్నె శేఖర్ ముదిరాజ్ , నాయకులు కటకం విరేష్ , వెంకట్ , ప్రభు మరియు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామిరెడ్డి , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయని ప్రభావతి , ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS