తోటి స్నేహితురాలికి ఆర్థిక సాయం చేసిన మిత్రబృందం

Spread the love

తోటి స్నేహితురాలికి ఆర్థిక సాయం చేసిన మిత్రబృందం

— గతంలో ఇద్దరు మిత్రులకు ఆర్థిక సాయం చేసిన మిత్రబృందం

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998 -99 సం.లో 10వ చదువుకున్న తోటి విద్యార్థిని అయిన మల్లెమోని నిర్మల ఆర్థిక సమస్యతో బాధపడుతుందని తెలుసుకుని తనతో కలిసి చదువుకున్న విద్యార్ధి బృందం 36 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
చిట్యాల పట్టణంలోని వారి ఇంటి వద్దకు వెళ్లి డబ్బులను ఇచ్చి మేమందరం ఉన్నామని మనో ధైర్యాన్ని కల్పించారు. ఆర్థిక సాయం చేసిన ప్రతి ఒక్కరికి నిర్మల ధన్యవాదాలు తెలిపారు. గతంలో తోటి మిత్రురాలు అలివేలు మంగ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని 67వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. అలాగే జనవరి నెలలో అనారోగ్య సమస్యతో మరణించిన తోటి మిత్రుడు బొడ్డుపెల్లి నరసింహ కుటుంబానికి 52 వేల ఆర్థిక సాయం అందజేసి మనోధైర్యాన్ని కల్పించారు.
ఈ కార్యక్రమంలో జేరిపోతుల సత్యనారాయణ జిట్టా చంద్రకాంత్ మాస నరేష్ బడుగు శివకుమార్ చిరబోయిన నరసింహ, పోలాస కన్నయ్య కాసం నరసింహ అబ్దుల్ కాసిం తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page