

నెల్లూరు నగర నియోజకవర్గంలోని 13వ డివిజన్ బాలాజీనగర్ బ్యాంకు కాలనీ లో రూ.35 లక్షలతో నిర్మిస్తున్న డ్రెయిన్ పనులకు నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ శంకుస్థాపన చేసారు. బ్యాంకు కాలనీ నుండి వెళ్ళు నాలుగు కూడళ్ళలో వున్నా పార్కు స్థలాలలో రూ.1.50 కోట్లతో నాలుగు పార్కుల అభివృద్ధికి టెండర్లు పిలవడం జరిగిందని, ఇప్పటికే యలమవారిదిన్నె, బలిజపాళెంలలో పార్కులను పూర్తి చేసామని, మిట్టపాళెం పార్కును పూర్తి చేయబోతున్నామనారు