SAKSHITHA NEWS

ముత్యాలమ్మపాలెం బీచ్ లో కుళ్లిన మృతదేహం లభ్యం

సాక్షిత : అనకాపల్లి జిల్లా పరవాడమండలం ముత్యాలమ్మ పాలెం సముద్ర ప్రాంతంలో ఒక వ్యక్తి మృతి దేహం లభ్యమైంది. పరవాడ పోలీస్
స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రాథమిక పరిశోధన ప్రకారం చనిపోయి 15 రోజుల నుండి నెల ముందు జరగవచ్చని తెలుస్తుంది. మృతుడి శరీరంపై బట్టలు లేవు చేతులపై పచ్చబొట్టు గుర్తులు ఉన్నాయి కుడి చేతి పై ప్లేయింగ్ ఈగిల్ బొమ్మ, 27, s,w,f, రాసి ఉండగా ఎడమ చేతిపై 8 & సీన్ బోల్ చిత్రం గుర్తించబడింది. కుడివైపు చూపుడువేలు పై PR అక్షరాలను పోలీసులు గుర్తించారు పరవాడ పరవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ మల్లికార్జున రావు మాట్లాడుతూ మండలంలో ఎవరైనా తప్పిపోయిన లేక సముద్రంలో మునిగిపోయిన ఈ వ్యక్తి ఆచూకీ తెలిసిన యెడల వెంటనే పరవాడ పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించాలని ఆయన కోరారు..


SAKSHITHA NEWS