వైభవంగా శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రథమ వార్షికోత్సవం

Spread the love

వైభవంగా శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రథమ వార్షికోత్సవం

పాల్గొన్న
చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి
బీజేపీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి

ఈ సందర్భంగా జీడిమెట్ల గ్రామ వాస్తవ్యులు తుంకి కృష్ణా రావు అమ్మవారికి వెండి కిరీటం చేయించి అలంకరించారు.

కుత్బుల్లాపూర్ నియోజికవర్గం జీడిమెట్ల డివిజన్ ( జీడిమెట్ల గ్రామంలో ) గల శ్రీ శ్రీ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయ ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న మేడ్చల్ జిల్లా బీజేపీ కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి కుత్బుల్లాపూర్ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని మొక్కుకున్నారు.

ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు, అశోక్, పూర్ణ చందర్, దశరథ్, నర్సింగరావు, శ్రవణ్, బాలప్ప, జేమ్స్, సంజీవరెడ్డి, మరియు గ్రామస్థులు రాజు, అరవింద్, రవి, గణేష్, ఎన్ దుర్గయ్య, ఎన్ కృష్ణ, శంకర్, శ్రీనివాస్ ముదిరాజ్, శ్రీకాంత్ రెడ్డి, నాగదీప్ గౌడ్, వర్మ, శ్రవణ్ లు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page