SAKSHITHA NEWS

కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రామం స్టేజ్ దగ్గర కోటి మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి .

సిఎం.కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా హరిత హరం మరియు కోటి మొక్కలను నాటే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని అన్నారు.

హరిత హారంతోనే పర్యావరణ సమతుల్యం అవుతుందని..పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను పెద్ద వృక్షలుగా పెరిగే విధంగా సంరక్షించాలని ఎమ్మెల్యే గారు కోరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు , బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS