SAKSHITHA NEWS

  • గాంధీభవన్ లో మద్దినేని స్వర్ణకుమారి దరఖాస్తు దాఖలు
  • పొంగులేటి వర్గం నుంచి ఎనిమిదోది

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పాలేరులో పోటీచేస్తా… అవకాశమివ్వండని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి గాంధీభవన్ లో శుక్రవారం దరఖాస్తు దాఖలు చేశారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో వేరే పార్టీల నుంచి పోటీ చేసిన అనుభవం ఉన్న తనకు పాలేరు అసెంబ్లీ సీటు కేటాయించాలని ఆ దరఖాస్తులో కోరారు. పొంగులేటి ఆదేశాల మేరకే ఈ దరఖాస్తును సమర్పించినట్లు ఆమె పేర్కొన్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న తనకు సీటు కేటాయిస్తే గెలిచి పాలేరు ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఆయన వర్గం నుంచి ఇప్పటికే ఏడుగురు దరఖాస్తులు దాఖలు చేయగా, తాజాగా ఎనిమిదో దరఖాస్తును స్వర్ణకుమారి సమర్పించారు.


SAKSHITHA NEWS