SAKSHITHA NEWS

హర్ ఘర్ తిరంగా 2.0 లో భాగంగా తపాలా శాఖ ఆధ్వ ర్యంలో కల్వకుర్తి పోస్టాఫీస్ లో జాతీయ జెండాలను విక్ర యించనున్నట్లు సబ్ పోస్ట్ మాస్టర్ శివాజీరాజ్ శివరాత్రి తెలిపారు. జాతీయ జెండా కావాల్సిన వారు పోస్టాఫీసుకు వెళ్లి రూ.25 చెల్లించి జాతీయ జెండాను కొనుగోలు చేయవ చ్చని అన్నారు. పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళలేని వారు ఆన్లైన్లో www.epostoffice.gov.in వెబ్సైట్ ద్వారా ఆగస్టు 12వ తేదీ వరకు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇంటి వద్దనే జెండాను పొందవచ్చని పేర్కొన్నారు.


SAKSHITHA NEWS