SAKSHITHA NEWS

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దు – కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు


*సాక్షిత : *గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ KS బేకరి రోడ్డు లో తలెత్తిన డ్రైనేజి సమస్యను జలమండలి అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భాగ్యనగర్ కాలనీ లో KS బేకరి రోడ్డు లో తలెత్తిన డ్రైనేజి సమస్యను పరిష్కరించడానికి కాలనీ లో పర్యటించడం జరిగింది అని బకెట్ క్లినింగ్ చేపట్టి మ్యాన్ హోల్ నుండి ప్రతి మ్యాన్ హోల్ వరకు బకెట్ క్లినింగ్ ద్వారా మ్యాన్ హోల్ లో పేరుకుపోయిన పూడికను తీయాలని, అదేవిధంగా డ్రైనేజి నీరు ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని ప్రతి మ్యాన్ హోల్ వద్ద పూడిక తీత తీయాలని, మ్యాన్ హోల్ లో పేరుకుపోయిన చెత్త చెదారం ను తీసి వేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఎక్కడ డ్రైనేజి సమస్యాత్మక ప్రాంతంగా నిత్యం పొంగే ప్రదేశాలలో, కాలనీ లలో ప్రథమ ప్రాధాన్యత గా బకెట్ క్లినింగ్ పెట్టి సమస్యను పరిష్కరించాలని, ఎక్కడ సమస్య ఉంటే అక్కడే పరిష్కారం చేయాలని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని జలమండలి అధికారులకు తెలియచేయడం జరిగినది అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. అదేవిధంగా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా నా దృష్టికి గాని కార్పొరేటర్ కార్యాలయం దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను తప్పకుండా పరిష్కరిస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియచేసారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని, డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం వెంకటేశ్వర్లు, మేనేజర్ ప్రశాంతి, వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్, సూపర్వైజర్ నరేంద్ర మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS