SAKSHITHA NEWS

కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

చేతన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కల్పించడమే సద్విద్దేశంతో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ఫౌండేషన్ వారి ఆహ్వానం మేరకు స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేతన ఫౌండేషన్ సభ్యులను వారు అభినందించారు. విద్యార్థులకు లాప్ టాప్ లు, వికలాంగులకు కృత్తిమ అవయవాలు, గృహనీలకు స్వయం ఉపాధి కొరకు కుట్టు మిషన్ లు, వీధి వ్యాపారస్తులకు తోపుడు బండ్లు, ఆకలితో ఉన్న వారికి ఆహార పదార్థాలు అందించడం హర్షించదగ్గ విషయం అని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గృహనిలు లబ్ది పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు అనిల్ కుమార్, ఎంపీటీసీ వరలక్ష్మి, సర్పంచి రుక్మిణి, జడ్పిటిసి బుజ్జి, ఎంపిటిసి కృష్ణవేణి, చేతన ఫౌండేషన్ సభ్యులు సీతారామయ్య, సురేష్, నరసింహారావు, నవీన్, రషీద్, అశోక్ తదితరు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS