నాభిశిల ఉత్సవానికి హాజరైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు

SAKSHITHA NEWS

దేవరకొండ సాక్షిత

దేవరకొండ మండలం తాటికొల్లు గ్రామంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాభిశిల ప్రతిష్టాపన మహోత్సవానికి గ్రామ సర్పంచ్ జూలూరి ధనలక్ష్మి ఆహ్వానం మేరకు హాజరైన దేవరకొండ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, యంపీపి జాని యాదవ్, రైతుబంధు అధ్యక్షులు శిరందాసు కృష్ణయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్
హాజరై ప్రత్యేక పూజలు చేశారు.

గ్రామ సర్పంచ్ అతిథులను సాదరంగా ఆహ్వానించి వారి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాలువాలతో వారి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాల నారాయణ, తూర్పుపల్లి సర్పంచ్ నిర్మల, కాసారం సర్పంచ్ యాదయ్య, బీఆర్ఎస్ నాయకులు గంటెల ఆంజనేయులు, గోగికార్ సురేశ్, ఎనిమల్ల రమేష్, చింతకుంట్ల రాకేష్, కోన్ రెడ్డి సోమలింగం, కుంభం మధు, ఎంపిటిసి లు, సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు ఉన్నారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page